Monday, September 22, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. 26 కంపార్టుమెంట్లు ఫుల్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులకు 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, బుధవారం 75,303 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,166 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం విలువ రూ.3.99 కోట్లుగా టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News