Monday, June 17, 2024

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. విఐపి బ్రేక్ దర్శనం రద్దు

- Advertisement -
- Advertisement -

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీవారిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు సర్వదర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. శ్రీవారి దర్శనా నికి వచ్చే భక్తులు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించు కోవాలంటే 30 నుంచి 40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లె క్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరారు.

క్యూలైన్‌లలోకి ప్రవేశించే పురుషులతోపాటు మహిళలు, వృద్ధులు, వికలాంగులు సుదీర్ఘ సమయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండక తప్పడం లేదు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 24 గంటలు, అంతకంటే ఎక్కువ కూడా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి టోకె న్లు లేని భక్తులకు ఆలయ అధికారులు 24గంటల సమయం కేటాయించారు. బాటగంగమ్మ ఆలయం నుంచి క్యూలైన్లలోకి అనుమతినిచ్చారు. వీరి కి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. శుక్ర, శని, ఆదివా రాలలో జూన్ 30 వరకు విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News