Sunday, May 12, 2024

తిరుమల ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, శనివారం 87,081 శ్రీవారిని  మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 41,575 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News