Thursday, April 25, 2024

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge Devotees Visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 81,034మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 47,312మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు వేచివున్నారు. సర్వదర్శనానికి భక్తులకు సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.24కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

Huge Devotees visit Tirumala Temple
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News