Tuesday, April 30, 2024

భార్యతో వివాహేతర సంబంధం… ప్రియుడి పురుషాంగాన్ని తుపాకీతో కాల్చి…

- Advertisement -
- Advertisement -

Woman Shot Dead In Bihar Thurs Day Night

తిరువనంతపురం: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రియుడి పురుషాంగంపై ఆమె భర్త కాల్పులు జరిపిన సంఘటన కేరళలోని చెంగనూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెంగనూరుకు చెందిన ఓ వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. దంపతులు మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. విడాకులు కేసు కోర్టులో ఉండడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తుందని తెలుసుకున్నాడు. వెంటనే భర్త వారు వద్దకు వెళ్లాడు. భార్య, ప్రియుడు కలిసి ఉండడంతో కోపంతో రగిలిపోయిన భర్త ప్రియుడి పురుషాంగంపై కాల్పులు జరిపాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రియురాలు భర్తపై ప్రియుడు ఫిర్యాదు చేయలేదు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News