ఛండీఘఢ్: ఇంటి ముందు ఉన్న వ్యక్తితో ఓ వివాహిత లేచిపోయింది. భర్తకు ఫోన్ చేసి ఇంటి ముందే కాపురం పెడుతానని చెప్పడంతో అతడు తన పిల్లలకు విషం ఇచ్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని కర్నాల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సుఖ్వీందర్ సింగ్, సిమా అనే దంపతులు బాద్సో గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా ఎదురింట్లో ఉండే కరణ్బీర్తో సిమా ప్రేమలో పడింది. కరణ్బీర్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించాడు. కరణ్బీర్తో కలిసి సిమా పారిపోయింది. భర్తకు ఫోన్ చేసి ఎదురింట్లో కాపురం పెడుతానని, ఇద్దరు పిల్లలని తామే పెంచుకుంటానని చెప్పడంతో సుఖ్వీందర్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ఇద్దరు పిల్లలకి విషం ఇచ్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిమా, కరణ్ బీర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.