Monday, April 29, 2024

అమెరికాలో బిడ్డకు జన్మనిస్తూ హైదరాబాద్ మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

అంత్యక్రియల సాయం కోసం భర్త వినతి

న్యూజెర్సీ: చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితర కారణాలతో ఎంతో మంది విదేశాల్లో స్థిరపడుతుంటారు. అక్కడ వారు పడే ఇబ్బందులు ఇంతా అంతా కావు. విదేశాల్లో మరణించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో మహిళ కూడా అమెరికాలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ కు చెందిన బిందు ప్రియ అనే మహిళ, ఆమె భర్త అంజనీ శ్రీకర్ బండ్లతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తోంది. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. ఆమె కుటుంబం ఇద్దరు నుంచి ముగ్గురు అయ్యే సమయం దగ్గర పడిందని సంతోషించేలోపే.. విధి వారిని చిన్న చూపు చూసింది. బిందు ప్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అనుకోకుండా ఆఖరి ఊపిరి వదిలింది. దీనితో ఆమె భర్త అంజనీ శ్రీకర్ బండ్ల.. ఆమె అస్థికలను ఇండియాకు తరలించడానికి.. ఆమె అంత్యక్రియ ఆచారాలను నిర్వహించేందుకు.. GoFundMe  అనే నినాదంతో.. నిధులను సేకరించడం ప్రారంభించాడు. తన భార్య మృతిచెందిన బాధతో అతను మాట్లాడుతూ.. “దేవుడు బహుమతి ఇచ్చాడు. కానీ ఓ జీవితాన్ని బలి తీసుకున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఆమె భార్య మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అతడు “హాయ్, నా పేరు శ్రీకర్, నా భార్య అనుకోకుండా ప్రసవంలో మరణించింది. మేము ఆమెను భారతదేశానికి ట్రాన్స్ పోర్ట్ చేయాలి. ఎవరైనా ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే, అది చాలా అభినందనీయం. మీ సాయం అంత్యక్రియల ఊరేగింపుల కోసం ఉపయోగించబడుతుంది. ధన్యవాదాలు.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అమెరికాలో ఆమె అంత్యక్రియల ఖర్చుల కోసం కోసం ప్రారంభించిన GoFundMe పేజీ ద్వారా.. 40,000 డాలర్లు వచ్చాయి. కానీ, ఆమె మరణానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక యూఎస్ లో పెరుగుతున్న మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు ఎక్కువవుతోందంటూ పరిశోధనలు చెబుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News