శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి(డిడిసి)కి జరిగిన ఎన్నికల్లో గుప్కార్ కూటమి(పిఎజిడి) అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. డిడిసిలో మొత్తం 280 స్థానాలుండగా, 278 ఫలితాలు వెల్లడయ్యాయి. గుప్కార్ 110,బిజెపి 75, స్వతంత్రులు 50, కాంగ్రెస్ 26,అప్నీ పార్టీ 12,పిడిఎఫ్, నేషనల్ పాంథర్స్ పార్టీ రెండు చొప్పున, బిఎస్పి ఓ స్థానంలో గెలిచాయి. పిఎజిడిలోని నేషనల్ కాన్ఫరెన్స్కు 67,పిడిపికి 27, పీపుల్స్ కాన్ఫరెన్స్కు 8, సిపిఐ(ఎం)కు 5, జెకె పీపుల్స్ మూవ్మెంట్కు మూడు స్థానాలు దక్కాయి. బిజెపికి 4.87 లక్షలు, పిఎజిడికి 3.94 లక్షలు,కాంగ్రెస్కు 1.39 లక్షలు, స్వతంత్రులకు 1.71 లక్షల ఓట్లు పోలయ్యాయి. బిజెపికి జమ్మూ ప్రాంతంలో 73 సీట్లు రాగా, కాశ్మీర్ ప్రాంతంలో మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, పార్టీలపరంగా చూస్తే బిజెపికి అత్యధిక స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 51 శాతంకుపైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువమంది ఓటింగ్లో పాల్గొన్నారు.