- Advertisement -
శ్రీనగర్: డిడిసి ఎన్నికల్లో అధికరణం 370 రద్దుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, జమ్మూకాశ్మీర్ ప్రజల వాణిని కేంద్రం వినిపించుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రజలు గుప్కార్ కూటమికి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విజయానికి డిడిసి ఎన్నికలు నిదర్శనమని బిజెపి చెప్పిన మాటల్లో నిజముంటే జమ్మూకాశ్మీర్లోని మెజార్టీ ప్రజలు 2019,ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలపలేదని ఆయన అన్నారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణం 370ని ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన విషయం తెలిసిందే.
- Advertisement -