Sunday, April 28, 2024

ఎన్నికల కమిషన్‌పై మోడీ నీడ!

- Advertisement -
- Advertisement -

ఎన్నికల తేది, తదితర కార్యక్రమం వెలవడునున్న తరుణంలో ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం పూర్తి అయినందున పోస్ట్ వేకెంటుగా ఉంది. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే పదవిలో మిగిలారు. ఆయన ఒక్కరే రాబోయే లోకసభ ఎన్నికలను నిర్వహిస్తారా అన్న మీమాంస తలెత్తిన సమయంలో ప్రధానమంత్రి గురువారం మధ్యాహ్నం ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రక్రియను సజావుగా పూర్తి చేశారు. సుఖ్బీర్ సింగ్ సంధు (ఉత్తరాఖండ్), గ్యానేశ్వర్ కుమార్ (కేరళ)ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తారు. కేవలం ప్రధానమంత్రి మోడీ మాట మాత్రమే చెల్లుబాటు అయ్యే రీతిలో ఈ నియామకాలు జరిగిపోయాయి.

ఇంతకుముందు ఎన్నికల కమిషనర్ ను నియమించే కమిటీలో ప్రధానమంత్రి తోపాటు లోక సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండేవారు. కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ కమిటీలో స్థానం ఉండటం మోడీకి ఇష్టం లేదు. అందుకే, గత మార్చిలో సుప్రీంకోర్టు నిర్దేశించిన సుప్రీంకోర్టు మాట చెల్లకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం హడావుడిగా ఎన్నికల కమిషనర్ల నియామక విధివిధానాల చట్టాన్ని మార్చివేసింది. అంతేకాకుండా ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేసారు. కొత్త కమిటీలో ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సభ్యుడు ఒకరు ప్రతిపక్ష నాయకుడు మాత్రమే సభ్యులుగా ఉంటారు.అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా స్థానం లేకుండా చట్టం తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం (ఏడీఆర్), కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాగూర్ కూడా సుప్రీంకోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగవలసిన సమయంలో అర్జెంట్‌గా మోడీ ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియమాకాన్ని హడాహుడిగా పూర్తి చేశారు.ఈ కమిటీలో సభ్యుడైన లోక్ సభ కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ కొత్త చట్టం తీసుకురావడాన్ని వ్యతిరేకించారు.అంతే కాక గురువారం జరిగిన నియామక పద్ధతి మీదకూడా అభ్యంతరాలు లేవవనెత్తుతూ ఒక అసమ్మతి పత్రాన్ని సమర్పించాడు. అయితే ఈ అసమ్మతి పత్రాన్ని ఖాతరు చేసేవారెవరు? అసమతి తెలియజేశాను అన్న ఆత్మ సంతృప్తి మాత్రమే ఆ ప్రతిపక్ష నాయకుడికి దిక్కింది.ఈ ముగ్గురు సభ్యులలో ఇద్దరు ప్రభుత్వానికి చెందిన వారే కనుక ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ఇక అసమ్మతికి, భిన్న అభి ప్రాయానికి తావుండే అవకాశం లేదు. కనుక మోడీ మాటే అంతటా, అన్నివేళలా చెల్లబాటు అవుతుంది.

ఈ ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ గురువారం సమావేశం అయింది.దీనికి అనుసరించిన తీరు అందులో ప్రస్తావనకు వచ్చిన పేర్లు కూడా అంతా ఒక పథకం ప్రకారమే గుట్టుగా జరిగి పోయినట్లు స్పష్టంగా కనపడుతుంది.
అధీర్ రంజన్ చౌదరి బుధవారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.ఆయనకు గురువారం మధ్యాహ్నం సమావేశం ఉంటుందని సమాచారం అందించారు. ఆయనకు 212 మంది పేర్లతో కూడిన ఒక జాబితాను పంపించారు. అంత తక్కువ సమయంలో పొడవైన జాబితా పరిశీలించి ఒక అభిప్రాయం చెప్పడం కష్టం. లేదా అభ్యంతరాలు చెప్పే అవకాశం అంటూ ఉండదు కనుక,ఈ జాబితాను షార్ట్ లిస్ట్ చేసిన జాబితా పంపాలని కోరితే, సరిగ్గా సమావేశం జరగటానికి కొద్దిగా ముందు ఆరుగురి పేర్లతో ఒక లిస్ట్ పంపించారు. ఈ కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నాయకుడి మాటకు ఎట్టి పరిస్థితుల్లోనూ విలువ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా లాంచన చర్యతో ఉదాసీనంగా వ్యవహరించింది. ప్రభుత్వం అనుకున్నట్టే నియామకాలు కూడా జరిగిపోయాయి.

ఎన్నికల సంఘంలో సభ్యులుగా ఎవరైతే నేమి అన్న అహంకార ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే తన మాటకు తిరుగుండదని కాబోలు సిబిఐ విజిలెన్స్ కమిషన్ కన్నా ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తితో మెలగవలసిన వ్యవస్థ ఎన్నికల కమిషన్ ది. కేంద్ర దర్యాప్త సంస్థలు ఏలాగు మోడీ గుప్పెట్లోనే ఉన్నాయి అనే విషయం ప్రతి రోజూ సర్వత్రా వినపడే విషయమే.భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు ఒక విశేషమైన ప్రత్యేక ప్రతిపత్తి స్థానాన్ని కల్పించింది. ఆ కమిషన్ వ్యవహారంలో ప్రభుత్వం చేసుకోవడానికి వీలుండదు. ఇలాంటి వెసులుబాటు ఉంటేనే కానీ, మన ప్రజాస్వామ్యానికి గుండెకాయవంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదు.కానీ ఎన్నికల ప్రక్రియ క్రమం అంతా తన ఇష్టాను సారమే జరగాలన్నది మోడీజీ పంతమైనప్పుడు రాజ్యాంగాన్ని మాత్రం ఆయన ఏలా ఖాతర్ చేస్తారు ? ఏ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో, అంతా మోడీ ఇష్ట ప్రకారమే జరగడం మొదలయి చాలా కాలమే అయింది.

గత బెంగాల్ శాసనసభ ఎన్నికలు నిర్వహించిన తీరు దీనికి ప్రబలమైన ఉదాహరణగా చెప్పుకోవాలి. మోడీజీకి కావలసింది రాజ్యాంగ పరిరక్షణా వ్యవస్థలు కావు. తన మాట తూచా తప్పకుండా పాటించే విధేయ సంస్థలే కావాలి.2019 ఎన్నికల్లో మోడీ, అమిత్ షా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాలన్న ఫిర్యాదులు వస్తే అప్పటి ఎన్నికల కమిషన్ అధిపతి ‘అశోక్ లవాస’ ఏదో చర్య తీసుకోవాలన్న ఆలోచన చేస్తే ఆయన కుటుంబంపై సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించారు.ఆయన ఒత్తిడులను తట్టుకో లేక విధిలేని పరిస్థితుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేసి పోయేదాకా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడులు తెచ్చింది. లవాసాను అక్షరాల ఎన్నికల కమిషనర్ పదవినుంచి తరిమేశారు.ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్లు కచ్చితంగా మోడీ మనస్సు ఎరిగి నడుచుకొనే వారే అయి ఉంటారేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News