Friday, June 20, 2025

భారత్ ఈ సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది: సచిన్

- Advertisement -
- Advertisement -

భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ రెండు జట్లు హెడ్డింగ్లే వేదికగా తలపడనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హాజరులో యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీం ఇండియాపై ఎలా ఆడుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటుందని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అంచనా వేశారు.

ఓ క్రీడా ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో భారత్ 3-1 తేడాతో విజయం సాధిస్తుందని అన్నారు. ఇక బౌలింగ్ అటాక్‌లో బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడని.. ఇతర బౌలర్ల నుంచి అతనికి సహకారం లభించాలని పేర్కొన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్‌లో ఉన్నాడన్న సచిన్.. అర్షదీప్, శార్ధూల్, నితీశ్, హర్షిత్ సపోర్టింగ్ బౌలర్ల పాత్ర తీసుకుంటారని తెలిపారు. స్పిన్‌లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లో రాణిస్తారని.. అందరూ కలిసి అద్భుతాలు చేస్తారని సచిన్ (Sachin Tendulkar) అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News