Tuesday, April 30, 2024

టీమిండియా క్రికెటర్లకు ఊరట

- Advertisement -
- Advertisement -

టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్‌కు కుటుంబ సభ్యులకు అనుమతి!

Indian Cricketers families allow to England Tour

ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో ఇంగ్లండ్‌కు వచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్‌లో ప్రస్తుతం కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుండంతో ఇక్కడి నుంచి రాకపోకలపై బ్రిటన్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఇక క్రికెటర్లకు కఠిన క్వారంటైన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇదిలావుండగా భారత క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని మన్నించిన బ్రిటన్ ప్రభుత్వం భారత క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులు తీసుకు వచ్చేందుకు సమ్మతించింది. ఇదిలావుండగా సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా పురుషుల జట్టు ఆరు టెస్టులు ఆడనుంది. ఇందులో ఐదు టెస్టుల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. మరోవైపు భారత మహిళా జట్టు కూడా ఇదే సమయంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో మహిళా జట్టు ఓ టెస్టుతో పాటు మూడు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

Indian Cricketers families allow to England Tour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News