Sunday, April 28, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే సదావకాశాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ రిజర్వేషన్ టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణానికి 24 గంటల ముందు రైల్వే శాఖకు విజ్ఞప్తి పెట్టుకోవడం ద్వారా ఈ టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది.

24 గంటల ముందు టికెట్ బదిలీ ఇలా..
ప్రయాణికులు రైలు బయలు దేరే సమయానికి 24 గంటల ముందు రిజర్వేషన్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలా చేస్తేనే మరో ప్రయాణికుడి పేరు మీద టిక్కెట్ బదిలీ అవుతుంది. ఉద్యోగులు అయితే పండుగలు, పెళ్లిళ్లు, వ్యక్తిగత కారణాలతో రైలు బయలుదేరే సమయానికి 48 గంటలకు ముందు ఈ విజ్ఞప్తిని పెట్టుకోవాలి. ఎన్సీసీ క్యాడెట్లకు కూడా ఇది వర్తిస్తుంది. టిక్కెట్ తన పేర బదిలీ కావాల్సిన ప్రయాణికుడి వెరిఫికేషన్ కోసం తప్పని సరిగా ఐడీ కార్డును కలిగి ఉండాలి. రిజర్వేషన్ టిక్కెట్ బదిలీ ప్రక్రియ దశలవారీగా ఉంటుంది.

అన్ని డాక్యుమెంట్లతో రిజర్వేషన్ కౌంటర్…
టికెట్ ప్రింట్‌ఔట్‌ను తీసుకొని- సమీప రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లాలి. -టిక్కెట్ బదిలీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ వంటి ఐడితో పాటు రిజర్వేషన్ కలిగి ఉన్న ప్రయాణికుడి ఐడీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. – అన్ని డాక్యుమెంట్లతో రిజర్వేషన్ కౌంటర్ ద్వారా టికెట్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News