Thursday, May 2, 2024

ఆస్ట్రేలియాలో భారత ట్రక్కు డ్రైవర్‌కు 22 ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Indian truck driver jailed for 22 years in Australia

మెల్‌బోర్న్: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నలుగురు పోలీస్ అధికారుల మరణానికి కారణమైన భారతీయ ట్రక్కు డ్రైవర్‌కు ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు 22 ఏళ్ల జైలుశిక్ష విధించింది. మొహీందర్‌సింగ్(48) అనే ట్రక్కు డ్రైవర్‌కు శిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. మత్తు పదార్థాలను వినియోగించడం, నిద్రలేమి కారణాలతోపాటు నిర్లక్షంగా డ్రైవ్ చేయడం ద్వారా నలుగురి చావుకు సింగ్ కారణమైనట్టు కోర్టు స్పష్టం చేసింది. మెల్‌బోర్న్‌లోని ఈస్టర్న్ ఫ్రీవేలో గతేడాది ఏప్రిల్ 22న పోలీసుల వాహనాలను 19 టన్నుల బరువుతో వెళ్తున్న ట్రక్కుతో ఢీకొట్టడం ద్వారా నలుగురి చావుకు సింగ్ కారణమయ్యారని సిసిటివిల ఫుటేజ్‌తోపాటు ప్రత్యక్ష సాక్షుల కథనాల్లో స్పష్టమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News