Wednesday, May 8, 2024

దీపావళికి ట్రీట్‌లా…

- Advertisement -
- Advertisement -

Interview with Hero Vishal

 

విశాల్, ఆర్య కాంబినేషన్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా గురువారం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో విశాల్ మీడియాతో మాట్లాడుతూ “దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన కథ వినగానే ఇదొక డిఫరెంట్ స్క్రీన్ ప్లే మూవీ అనిపించింది. మరో రోల్ కోసం నా మిత్రుడు ఆర్య పేరును సూచించాను. ఆర్య కథ విని వెంటనే ఒప్పుకున్నాడు. సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. తమన్ ఇచ్చిన సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. ఇక డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఏం చెప్పారో దానికంటే ఎక్కువ బాగా వచ్చింది ఈ సినిమా. ఇదొక ట్రీట్‌లా ఉంటుంది. ఈ దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News