Thursday, September 25, 2025

అరవింద్‌కుమార్ విచారణకు ఓకే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకం గా వ్యవహరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డిలపై ప్రాసిక్యూషన్ అనుమతికి విజిలెస్స్ కమిషన్ సిఫారస్సు చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతించాలని ఇప్పటికే ఏసిబి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈనివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చింది. ఈ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోరింది. ఈ విషయంపై గవర్నర్ ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఈ రేసు నిర్వహణలో విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్దంగా సొమ్ము చెల్లించారని దీంతో ప్రభుత్వానికి రూ. 54.88 కోట్ల నష్టం వాటిల్లందంటూ ఏసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కెటిఆర్, పలువురు ఉన్నతాధికారులపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. కాగా, గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసిబి అధికారులు సిద్దమవుతున్నారు. క్విడ్ ప్రోకో విధానంలో బిఆర్‌ఎస్ రూ. 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్, హెచ్‌ఎండిఏ నిధుల దుర్వినియోగం, ఈ కార్ రేసింగ్ నిర్వహణ ఖర్చు రూ. 600 కోట్లకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఏసిబి ఛార్జ్‌షీట్ సిద్దం చేస్తొన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News