Sunday, April 28, 2024

IPL 2024: లక్నోపై రాజస్థాన ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణి కొట్టింది. లీగ్ దశలో భాగంగా జైపూర్ వేదికగా లక్నో సూపర్ గెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఆర వికెట్లు కోల్పోయి కేవలం 173 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కెప్టెన్ కెఎల్ రాహుల్(58), నికోలస్ పూరన్(64 నాటౌట్)లు రాణించినా ఇతర బ్యాట్స్ మెన్లు చేతులెత్తేయడంతో లక్నోకు ఓటమి తప్పలేదు.

అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్(82 నాటౌట్) భారీ అర్థ శతకంతో చెలరేగాడు. ఇక, ఓపెనర్ యశస్వి జైస్వాల్(24), రియాన్ పరాగ్(43), ధ్రువ్ జురెల్(20 నాటౌట్)లు రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News