Thursday, May 2, 2024

టీమిండియాకు కలిసివచ్చే అంశమే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యుఎఇలో ఐపిఎల్ టోర్నమెంట్ జరగడం టీమిండియాకు ఎంతో కలిసి వచ్చే అంశమని బిసిసిఐ కార్యదర్శి జై షా అభిప్రాయపడ్డారు. ఐపిఎల్ ముగిసిన వెంటనే ట్వంటీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్ కూడా యుఎఇలోనే జరుగడం భారత్‌కు సానుకూల అంశమన్నారు. అక్కడి పిచ్‌లపై భారత క్రికెటర్లకు మంచి అవగాహన ఏర్పడడం ఖాయమన్నారు. కాగా భారత్‌లోనే వరల్డ్‌కప్ నిర్వహించాలని తాము భావించినా పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో వేదికను మార్చక తప్పలేదన్నారు. అన్ని ఆలోచించే యుఎఇ, ఒమాన్‌లను ప్రపంచకప్‌కు వేదికలుగా ఎంపిక చేశామన్నారు.

IPL to help team india for T20 World Cup: Jay shah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News