Friday, May 3, 2024

IPL 2024: బెంగళూరు కెప్టెన్ కు భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కు బిసిసిఐ షాకిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. నిర్ణీత సమయం కన్నా ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది బెంగళూరు. దీంతో కెప్టెన్ డుప్లిసెస్ కు రూ.12 లక్షల భారీ జరిమానా విధించింది.

ఈ సీజన్ లో ఇప్పటికే గుజరాత్ కెప్టెన్ గిల్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్, కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, చెన్నై కెప్టెన్ రుతురాజ్, లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ లకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News