Sunday, April 28, 2024

పాకిస్థాన్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్

- Advertisement -
- Advertisement -

జైష్ అల్ అదిల్ కమాండర్ హతం

ఇస్లామాబాద్ : పాక్ భూభాగంలో ఇరాన్ మరోసారి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో ఉగ్రసంస్థ ‘జైష్ అల్ అదిల్ ’ కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్ హతమైనట్టు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అతడి అనుచరులు కొందరిని కూడా అంతమొందించినట్టు పేర్కొంది. గత నెల బలూచిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలే లక్షంగా జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది.

ఆ మరుసటి రోజే పాక్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్‌లోని సిస్థాన్‌ఒ బలూచిస్థాన్‌లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసినట్టు ఆ దేశ విదేశాం గ శాఖ ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా జైష్ అల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూపు పనిచేస్తూ ఇరాన్‌లోని సిస్థాన్‌బలూచిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హమాస్‌ఇజ్రాయెల్ ఘర్షణలతో ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఇప్పుడు ఇరాన్‌పాక్ ఘర్షణలతో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News