Sunday, April 28, 2024

ఇస్రో సైంటిస్టుల మనసు ఆకాశమంత..

- Advertisement -
- Advertisement -

చెన్నై : ఇస్రో శాస్త్రజ్ఞులు తమ ఇంజనీరింగ్ ప్రతిభతో దేశ ప్రతిష్టను ఆకాశపు అంచులు దాటిన అంతరిక్షం వరకూ తీసుకువెళ్లారు. మరో వైపు వారి దానగుణం అంతకు మించిన సమున్నత శిఖరాలకు వారిని చేర్చింది. దాతృత్వంలో ఇస్రో దిగ్గజ సైంటిస్టులు ఇప్పుడు వెలలేని ఆణిముత్యాలుగా మారుతున్నారు. చంద్రయాన్ ప్రాజెక్టులోని కీలకమైన ల్యాండర్ విక్రమ్ రూపశిల్పిగా ఘనత వహించిన డాక్టర్ పి వీరముత్తువెల్ ఓ వైపు తన ఇంటి రుణాలు తీర్చాల్సి ఉంది. కానీ మరోవైపు ఆయన తన దాతృత్వం చాటుకుంటూ పలు మంచి కార్యక్రమాల కోసం ఇప్పటికీ రెండేళ్ల కాలపు తన వేతనాన్ని దానం చేశారు.

తమిళనాడు ప్రభుత్వం వీరముత్తు ప్రతిభకు గుర్తింపుగా రూ పాతిక లక్షలను గాంధీ జయంతిరోజున పారితోషికంగా అందించింది. అయితే తన వ్యక్తిగత రుణాలను తీర్చుకోవడానికి బదులుగా ఆయన వీటిని తాను చిన్ననాట చదువుకున్న విద్యాసంస్థలకు కానుకగా అందించేందుకు సిద్ధం అయ్యారు. మరో సైంటిస్టు డాక్టర్ ఎం శంకరన్ ఇప్పుడు యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా అందినపాతిక లక్షల రూపాయలను తాను కేరళలో చదువుకున్న కాలేజీలకు వితరణ చేశారు. పూర్వపు విద్యార్థిగా తన బాధ్యత చాటుకున్నారు. రాకెట్ సైంటిస్టుగా పేరొందిన సైంటిస్టుల సహృదయత వారి ప్రతిభను వారి సేవాభావాన్ని మించిపోయే రీతిలో వారికి ఘనత ఆపాదిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News