Thursday, May 2, 2024

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో…

- Advertisement -
- Advertisement -

విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘జెమ్‘. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘జెమ్’ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ.. “ఇద్దరి అమ్మాయిల మధ్య చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన అహం ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చింది అనేది కథ. ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య అబ్బాయి ఇరుక్కుంటాడు. అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. వీళ్ల ఈగో ప్రాబ్లమ్స్ పరిణామాలు ఎదుర్కొంటూ తన ప్రేమను హీరో ఎలా సాధించుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఈ చిత్రంలో చూపించాం. జెమ్ సినిమాకు పవర్‌ఫుల్ నేపథ్యం ఉండాలని రాయలసీమ బ్యాక్‌డ్రాప్ పెట్టాం. ఈ కథలో హీరో క్యారెక్టర్ వీడు జెమ్‌రా అనిపించేలా ఉంటుంది. అతను చాలా ఇంటెలిజెంట్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అతనిలో సూపర్ హీరో లక్షణాలు ఉంటాయి. అందుకే టైటిల్ ‘జెమ్’ అని పెట్టాం. రాశీ సింగ్, నక్షత్ర, విజయ్ రాజా ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాలో కీలకం. జెమ్ రిలీజ్ అయ్యాక ఈ ముగ్గురికీ మంచి పేరొస్తుంది” అని అన్నారు.

‘JEM’ Movie to Release on Sep 17

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News