- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ హైకోర్టులో శనివారం విజయసేన్ రెడ్డి చేత న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది. 1994 లో ఎపి బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా విజయసేన్ రెడ్డి చేరారు. ఇక, హైకోర్టులో కేసులను తీసుకునే ముందు విజయసేన్ రెడ్డి.. సబార్డినేట్ కోర్టులు, ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు.
Justice VijaySen Reddy takes oath as TS High Court Judge
- Advertisement -