Sunday, April 28, 2024

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం రేవంత్‌ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర రాజనర్సింహ, రఘువీరా రెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, వంశీచందర్ రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డిలు పాల్గొననున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లో పార్టీ ఓటమిపై చర్చ, ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో పార్టీ వ్యూహం ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News