- Advertisement -
హైదరాబాద్: పలు ప్రాంతాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గ్రౌండ్లో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలకు ధన్యవాదాలు అని, లాక్డౌన్ నిబంధనలు పాటించి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, పకడ్బందీ లాక్డౌన్ అమలుతోనే సురక్షితంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Telangana people happy with Lockdown say Mallareddy
- Advertisement -