Friday, May 3, 2024

తాళ్లరేవులో ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో తాళ్లరేవులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. మహిళ కార్మికులు ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు రొయ్యలు పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులుగా గుర్తించారు. తాళ్లరేవు నుంచి యానాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: సిఎం సీటెవరిది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News