Tuesday, April 30, 2024

‘కార్తికేయ 2’ ఇంకా పెద్ద విజయం సాధించాలి

- Advertisement -
- Advertisement -

Karthikeya 2 Movie Success Meet

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్స్‌పై యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా థియేటర్స్‌లలో విడుదలై ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ వాసు, మైత్రి అధినేత నవీన్ ఏర్నేని అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమాను హిందీ లో సరదాగా రిలీజ్ చేద్దామని 50 థియేటర్స్‌లలో రిలీజ్ చేస్తే అది రెండో రోజుకు 200 థియేటర్స్ అయి ఈ రోజు 700 థియేటర్స్‌లలో ఆడుతోంది. అంటే ఈ సినిమా లాంగ్వేజ్ అనే బారికేడ్లను దాటి ప్రజల గుండెల్లోకి వెళ్ళింది. ఈ సినిమాలో సత్తా లేకపోతే అన్ని థియేటర్స్ లలో ఆడదు కదా. కాబట్టి ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలి”అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “ఇండియా మొత్తం ప్రేక్షకులు అందరి ఆదరాభిమానాలను చూరగొన్న కార్తికేయ 2 సినిమా టీం కు కంగ్రాట్స్. సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. మాకు ఏ సినిమా అయినా బాగా ఆడితే ముందు మేము ఆనందపడతాము తప్ప సినీ ఇండస్ట్రీలో మాకు ఎలాంటి విభేదాలు లేవు”అని చెప్పారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ మా సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బాగా ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. చిత్ర దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ “మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు. అలాగే మా చిత్ర నిర్మాతల సహకారం మరువలేనిది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Karthikeya 2 Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News