Sunday, April 28, 2024

తెలంగాణ నీటి పారుదల వ్యవస్థను కెసిఆర్ సర్వనాశనం చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను కెసిఆర్ సర్వనాశనం చేశారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బోర్డు ప్రాజెక్టుల అప్పగింతపై తమ ప్రమేయం లేదని, బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను అప్పగించబోమని ఆయన పేర్కొన్నారు. రెండు టింఎంసీల కోసమే కెసిఆర్ కాళేశ్వరం కట్టారని ఆయన ఆరోపించారు. రూ.95 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన విమర్శించారు. వేల కోట్లు ఖర్చు చేసిన ఎకరాకు నీళ్లియ్యలేదని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసమే కెసిఆర్ హైలెవల్ మీటింగ్‌కు హాజరుకాలేదని ఉత్తమ్ ఆరోపించారు. జగన్ నీళ్లు ఎత్తుకు పోతుంటే కెసిఆర్ ఏకాంత చర్చలో మునిగిపోయారని ఆయన విమర్శించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు కెసిఆర్ అన్యాయం చేశారని ఆయన చెప్పారు.
నీళ్ల దోపిడీకి ముఖ్య కారకుడు కెసిఆర్
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ను పదేళ్లలో కెసిఆర్ ఒక్క కిలోమీటరే తవ్వించారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు. కెసిఆర్ తీరుతో తెలంగాణ కృష్ణా నీటి ప్రాజెక్టులు ఎడారిగా మారిందని ఆయన ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్వివ్వలేదన్నారు. 27 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ. 67 వేల కోట్లకు అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News