Sunday, April 28, 2024

శ్వేతపత్రం తప్పుల తడక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం పుస్తకం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు.అసెంబ్లీలో శనివారం శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులలో చేసిన అవకతవ కలను శ్వేతపత్రం ద్వారా ఎండగట్టారు. ఈ సందర్భంలో బిఆర్‌ఎస్ నుంచి మాట్లాడిన హరీశ్‌రావు ఇరిగేషన్ శాఖ ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సత్యదూరంగా అబద్ధాల మయంగా ఉందని, గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారని విమర్శించారు. శ్వేతపత్రంలో ఒకటవ అబద్ధంగా మిడ్ మానేరు, ఎల్లంపల్లి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారని, అప్పుడు కాలేదని, వారు అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక 2014లో నేను మంత్రిగా ఉన్నప్పుడు రూ.775 కోట్లతో చేసి నీళ్ళు ఇచ్చామన్నారు.రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారని, అప్పుడు కా లేదని, వారు అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక 2014లో నేను మంత్రిగా ఉన్నప్పుడు రూ.775 కోట్లతో చేసి నీళ్ళు ఇచ్చామన్నారు.

రెండో అబద్ధంగా కాళేశ్వరంపై ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారని, ఒక్కో పేజీలో ఒక్కో విధం గా చెప్పారన్నారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే రూ.54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారని, ఇదే నివేదికలో మరో చోట 19562014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణాలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారని, ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారని, ఖర్చులో ఎలాంటి మార్పు లేదని, నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మా త్రం తేడా ఉందన్నారు. మూడో అబద్ధంగా రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నారని, అది కూడా తప్పని ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లోనే అని, ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా 28/1/2020న కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కెఆర్‌ఎంబికి పిర్యాదు చేశామన్నారు. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతామని, మేం అసలు ఫిర్యాదే చేయలేదనే సత్యదూరమైన విషయాన్ని పదేపదే చెబుతున్నారని, ఇది పద్ధతి కాదన్నారు. నాల్గవ అబద్ధంగా కెఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించాలని గెజిట్ ఇస్తే మేం సవాల్ చేయలేదన్నారని, అది కూడా అబద్ధమని, మేం వ్యతిరేకిస్తూ రిఫర్ చేయాలని చెప్పామన్నారు. ఐదో అబద్ధంగా కెఆర్‌ఎంబీకి మేమే అప్పగించామని మరో అబద్దం చెప్పారని, మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టామని, ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరవ అబద్ధంగా 50:50 రేషియో కోసం మేం కొట్లాడలేదన్నారని, రాష్ట్ర విభజన నుంచి ఎన్నోసార్లు కోరామని, ఫిర్యాదులు చేశామని, న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చామని బీఆరెస్ వాదనను వినిపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. మేడిగడ్డను వర్షాకాలంలోగా పునరుద్ధరించి రైతులకు సాగునీరందించాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులేవి కూలిపోనట్లుగా చెబుతున్నారంటు వారి హయాంలో కడెం ప్రాజెక్టు 1958 కొట్టుకుపోయిందని, పునరుద్దరించాక తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయిందని, సింగూర్ డ్యాం 1981,1999 కొట్టుకుపోయిందన్నారు. ఎల్లంపల్లి బ్యారేజ్ 2010లో బాన్సుస్ స్పిల్ వే కొట్టుకుపోయిందని, సాత్నాల ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ 2004లో కొట్టుకుపోయిందని, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోయాయని, పుట్టంగండి ప్రాజెక్టు కొట్టుకపోయిందన్నారు.
ఒక ప్రాజెక్టుకు నాలుగుసార్లు ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది
ఒక ప్రాజెక్టుకు నాలుగు సార్లు ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 2007-08లో కొబ్బరికాయ కొట్టారు. రూ. 168 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మోబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ. 1400 కోట్లు బిల్లులు లేపారని వెల్లడించారు. తప్పు లేనట్లు ఉత్తమ్ మాట్లాడారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడాన్ని కాగ్ సైతం తప్పు బట్టిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు రీ ఇంజినీరింగు సంబంధించి కెసిఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో తుమ్మల నాగేశ్వర రావు కూడా సభ్యులుగా ఉన్నారని గుర్తు చేశారు. అనేక రోజులు మాట్లాడి, విశ్లేషణలు చేసిన తర్వాత రీ ఇంజినీరింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి ప్రాజెక్ట్ మార్చాలి అనుకోలేదు. అప్పటి కాంగ్రెస్ 7 ఏళ్లలో ఎలాంటి ప్రాజెక్ట్ అనుమతులు సాధించలేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగు రోజుల్లోనే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని నాడు కెసిఆర్ లేఖ రాశారన్నారు. మహారాష్ట్రతో తాము అనేక సంప్రదింపులు చేశామన్నారు. గతంలో మహారాష్ట్ర సిఎం నాడు ఎపికి లేఖ రాశారన్నారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు, చేసే ఖర్చు వృధా అవుతుందని చెప్పారు. అయినా పట్టించుకాకుండా ప్రాణహిత విషయంలో ముందుకు వెళ్ళారు.తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అని నాడు సిడబ్లూసి కూడా చెప్పిందన్నారు. 2007 నుండి 2014 దాకా కేంద్రంలో, ఎపిలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కనీసం అగ్రిమెంట్ చేయలేదన్నారు. మార్చడానికి మూడు వేల ఎకరాలు కాదు, అక్కడ నీళ్లె లేవని సీడబ్లూసి చెప్పిందన్నారు. జలాశయాల సామర్థ్యం సరిపోదని కేంద్రం రిపోర్ట్ చెప్పిందని వెలడించారు. ఉమ్మడి పాలనలో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.అది కాంగ్రెస్ పాలన తీరుకు ఉదాహరణ అని తెలిపారు. అధికారంలో ఉన్నారు మేము తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. మేము తప్పు చేయలేదు. భయపడలేదన్నారు.

కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడు, గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడు. ఇట్ల చెప్పుకుంటు పోతే రేపటి దాకా చెప్పొచ్చన్నారు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు. మా పాలనలో పొలాలకు నీళ్ళు ఎలా వచ్చాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఆయకట్టు తక్కువ వచ్చినదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. మీరు ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారమే, కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిందని ఉందన్నారు. 1963లో శంకుస్థాపన చేస్తే, ఎస్సారెస్పీ 11 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు ఇచ్చింది 25 వేల ఎకరాలు, నాగార్జున సాగర్ కు 1955 లో ఫౌండేషన్ వేస్తే 12 ఏళ్ల తర్వాత 98 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారన్నారు. 1984-2014 వరకు అంటే 30 ఏళ్ల వరకు కల్వకుర్తి ద్వారా ఇచ్చింది 13 వేల ఎకరాలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. 2001 లో దేవాదుల చంద్రబాబు ప్రారంభిస్తే 2014 వరకు ఇచ్చిన ఆయకట్టు 45 వేలు మాత్రమే 14 ఏళ్ల తర్వాత కాళేశ్వరం విషయంలో మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాగ్ నివేదిక మీద కాంగ్రెస్ మాట్లాడితే సెల్ఫ్ గోల్ పెట్టుకోవడమేనన్నారు.

చంద్రబాబు కాగ్ నివేదిక అశాస్త్రీయం అన్నారని, ఆ తర్వాత వై యస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు తప్పు పట్టేందుకు కాగ్‌కు అధికారం ఉండదన్నారు. కాగ్ నివేదిక బైబిల్, ఖురాన్, భగవదీత కాదు అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ కాగ్ నివేదిక తప్పుల తడక, కాగ్ విషయాలు ప్రామాణికత లేదన్నారన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొనేందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. రంగారెడ్డి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేలా పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టాం. కాల్వలు తవ్వి నీళ్ళు అందించాలన్నారు. చాప్రల్ రిజర్వాయర్ ఉంది. ముం పు గురవుతుంది అని ప్రాజెక్ట్‌కు కేంద్రం ఒప్పుకోలేదన్నారు. కెసిఆర్ స్వయం గా మహారాష్ట్ర వెళ్లి మాట్లాడారు. ఒప్పించెలా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యాప్ కొస్ చెబితేనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ ప్రారంభించామని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు కావాలని పునరుద్దరణ చేయకుండా చూస్తున్నారని, మొత్తం కూలిపోయి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతున్నదన్నారు. రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుందని తెలిపారు. వర్షాకాలం వచ్చే లోపు పునరుద్దరణ పనులు చేపట్టాలన్నారు. తప్పులు ఎవరు చేసినా శిక్ష వేయండని, తాము కూడా సహించమన్నారు.

కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు మొదటి ఫిల్లింగ్‌కే కొట్టుకుపోయిందని, దేవాదుల పైపులు నాడు పటకుల్లగా పేలి పోయాయని, పంజాగుట్ట ప్లే ఓవర్ కూలిపోయిందని, సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, పుట్టంగండి, పోలవరం డ్యాముల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. మిషన్ కాకతీయ వల్ల 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. భూగర్భ జలాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. నాడు వేల సంఖ్యలో చెరువులు తేగేవని, మిషన్ కాకతీయ వల్ల తగ్గాయన్నారు. ప్రాజెక్టుల ద్వారా నాడు నీళ్ళు ఇవ్వొద్దని నిబంధన ఉండేదని, కానీ కెసిఆర్ ఆదేశాలతో 6200 చెరువులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. నాడు నేరం అయితే కెసిఆర్ కాలంలో వరం అయ్యిందన్నారు. పేరుకు 9 లక్షల ఎకరాలు కానీ, ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా ఎన్నడూ 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదన్నారు. కాల్వలు ఆధునికీకరణ చేసి చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చామన్నారు. పదేళ్లలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద, 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేశామని, 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశామని వెల్లడించారు. జలయజ్ఞములో 35 పనులు మంజూరు చేస్తే, పదేళ్ళలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని విమర్శించారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ద్వారా 2014 వరకు 27,300 ఎకరాలకు ఇస్తే, మేము 9 ఏళ్లలో 6లక్షల 36 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారన్నారు. నాగార్జున సాగర్ అంచనా 9.7 రెట్లు పెరిగిందని, శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ 107 రెట్లు, జూరాల 25 రెట్లు, పులిచింతల 320 రెట్లు, సింగూరు 3.2 రెట్లు, ఎల్లంపల్లి 2.27 రెట్లు పెరిగిందన్నారు. కాళేశ్వరం రెండు రెట్లు పెరిగిందని మాట్లాడుతున్నారని, 2005లో ఇంజినీర్లు పాలమూరు పథకంపై రిపోర్ట్ ఇచ్చారని, ప్రారంభించిన తర్వాత ఎపి గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళిందన్నారు. తాము కొట్లాడి అన్ని రకాల అనుమతులు సాధించామన్నారు. ప్రాజెక్టుల వారీగా నీళ్ళు ఇచ్చేలా సెక్షన్ 3 సాధించామని, ఆరు నెలల్లో నీటి వాటా వచ్చేలా మీరు వాదనలు వినిపించాలని, 299 కాదు, 600 టిఎంసికిపైగా నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు.
దోషులను శిక్షించండి
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగితే విచారణ చేయండి, దోషులను శిక్షించండి కానీ రైతులకు నష్టం చేయకండని హరీశ్‌రావు కోరారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టించిన బ్యారేజీలు కూలి పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, అందుకోసమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయకుండా అలస్యం చేస్తున్నట్లు అనుమానం వస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో లంచ్ బ్రేక్ సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీశ్‌రావు.. మాజీ సిఎం కెసిఆర్ చేసిన మంచి పనుల అనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలున్నాయనే విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని, మేడిగడ్డ బ్యారేజీ పనికిరాదన్న ముద్ర వేసి దాన్ని నిరూపయోగం చేసే ఫ్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News