Saturday, April 27, 2024

కీసరలోని బిసి గురుకుల పాఠశాలలో కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు….

- Advertisement -
- Advertisement -

 

మేడ్చల్: ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా సిఎం కెసిఆర్ సారథ్యంలో ప్రగతి పథంలో తెలంగాణ రాష్ట్రం అనే అంశంపై కీసరలోని బిసి గురుకుల (బాలికల) పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.   తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, కమీషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, ఉపేంద్ర గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.  ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో పాఠశాల విద్యార్థులు, సిబ్బందితో కలిసి కమీషన్ ఛైర్మన్, సభ్యులు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News