Monday, May 13, 2024

దళితజన బాంధవుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కొనియాడారు. ఎస్‌సి కులాలను సా మాజిక, ఆర్థిక వివక్ష నుంచి ఆత్మ గౌరవం దిశ గా సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసే లా ఉందని, ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చంద్రశేఖర్ ఆజాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సాగిన సుధీర్ఘ చర్చలో దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరులు, మరింతగా కులం పేరుతో మనుషులను విభజి స్తూ, సామాజిక వివక్షకు గురిచేస్తూ, ఆహార నియమాలను నియంత్రిస్తూ, దళితులపై దేశంలో అమలవుతున్న దమనకాండను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌తో ఆజాద్ చర్చించారు. చర్చ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న దళిత అభివృద్ధి కార్యాచరణ భవిష్యత్తులో దేశంలోని దళితుల సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. దళితబంధు పథకం దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అమలవుతున్న పథకమని స్పష్టం చేశారు. దళితబంధు విజయగాథలను తాను తెలుసుకున్నానని, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు ప్రారంభమైందని, ఇది ఎంతో గొప్ప విషయమని ఆజాద్ అన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే దళితుల సాధికారతకు తోడ్పడుతూ, వారిని వ్యా పారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న దళితబంధు పథకం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
సిఎం కెసిఆర్ దార్శనికత మహోన్నతమైనది
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిగడ్డపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం సిఎం కెసిఆర్‌కి అంబేద్కర్ పట్ల ఉ న్న అభిమానానికి, వారి ఆశయాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందని చంద్రశేఖర్ ఆజా ద్ తెలిపారు. అదే సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిదని అన్నారు. దళిత,బహుజన, పీడిత వర్గాల ప్రగతి లక్ష్యంగా పాలనను అందించే ప్రజాస్వామిక సౌధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని నిర్మించడం వెనక సిఎం కెసిఆర్ దార్శనికత మహోన్నతమైనదని చెప్పారు.
గురుకులాలు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి
రాష్ట్రంలో అమలవుతున్నంత గొప్పగా గురుకుల విద్య దేశంలో మరెక్కడా అమలు కావట్లేదని ఆజా ద్ అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ బిడ్డలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందిం చే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం నడుపుతున్న వందలాది గురుకులాలు ప్రపం చ జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. దేశ విదేశాల్లో దళితబిడ్డలు చదువుకునే దిశగా ఆర్థిక సహాయం అందిస్తూ, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని అమలుచేస్తున్న విషయం తా ను తెలుసుకున్నానని, ఈ పథకం సహాయంతో ఇప్పటికే ఎంతోమంది దళితబిడ్డలు విదేశాల్లో వి ద్యనభ్యసిస్తుండటం తనకెంతో ఆనందంగా ఉంద ని అన్నారు. అంతేకాకుండా ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక ప్రగతి నిధి అమలు తీరు దేశంలోని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాల్సి ఉన్నదని ఆజాద్ తెలిపారు. దళిత జనబాంధవుడిగా నిలిచిన సిఎం కెసిఆర్‌కు ఆజాద్ ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
మహాసభలకు ఆహ్వానం
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఆగస్టు 26వ తేదీన జరిగే భీమ్ ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సిఎం కెసిఆర్‌ను చంద్రశేఖర్ ఆజాద్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు హరీష్‌రావు, జి.జగదీష్‌రెడ్డి, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంఎల్‌ఎలు గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News