Thursday, May 2, 2024

కెసిఆర్ పాలన అద్భుతం: బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్

- Advertisement -
- Advertisement -

మైనారిటీల సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి

తెలంగాణ తరహా పథకాలు బీహార్ లోను అమలు చేస్తాం

బీహార్ సిఎం నితీష్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర పథకాలను వివరిస్తా

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఖమరుద్దీన్ పని తీరు భేష్

మూడేళ్ళ కాలంలో ఖమరుద్దీన్ 1,400 కేసులను పరిష్కరించారు

సిఎం కెసిఆర్ పాలన అద్భుతం

KCR rule is wonderful

హైదరాబాద్: మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే అగ్రగామిగా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్ హుస్సేన్ హకీం కొనియాడారు. మంగళవారం మంత్రుల నివాసంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో యూనుస్ హుస్సేన్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనుస్ హుస్సేన్ హకీం మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాటు బీహార్ మైనార్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న తన అనుభవంతో గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూలంకషంగా పరిశీలించినట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలను కూడా స్వయంగా చూసినట్లు తెలిపారు. తెలంగాణలో మైనారిటీల కోసం వందలాది గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, విదేశీ విద్య కోసం నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని ఆయన కొనియాడారు.

గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్షా 81 వేల 398 మంది మైనారిటీలకు షాది ముబారక్ పథకం కింద రూ. 1,402 కోట్లు విడుదల చేయడం ఒక చరిత్ర అని ప్రశంసించారు. పేదరికంలో మగ్గుతున్న మైనారిటీలకు షాది ముబారక్ పథకం ద్వారా అందుతున్న నగదు ఎంతో మేలు చేస్తోందని, మైనారిటీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల బడ్జెట్ ను కేటాయించడం కూడా గొప్ప విషయమన్నారు. తెలంగాణ  రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ గా ఖమరుద్దీన్ అందించిన సేవలు ఆమోఘమని హకీం అభినందించారు. మూడేళ్ళ కాలంలో కమిషన్ చైర్మన్ గా ఖమరుద్దీన్ 1,400 కేసులను పరిష్కరించారని కొనియాడారు. బోయినపల్లి వినోద్ కుమార్ తో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ మహమ్మద్ ఖమరుద్దీన్, మైనార్టీల రాష్ట్ర నాయకులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News