Sunday, April 28, 2024

సిఎఎని కేరళలో అమలు చేయం: సిఎం పినరయి విజయన్

- Advertisement -
- Advertisement -

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) ప్రజలను మతపరంగా చీల్చే చట్టంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే సిఎఎని కేరళలో అమలు చేసే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. మతపరమైన చీలికను తెచ్చే ఈ చట్టాన్ని వ్యతిరేకించడంలో కేరళ సమాజమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించడానికి ముందు సిఎఎకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీచేసిందని, దేశంలో అశాంతిని సృష్టించేందుకే కేంద్రం ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ప్రజలను విభజించి, మతపరమైన మనోభావాలు రెచ్చగొట్టి, రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కడానికే కేంద్రం సిఎఎ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News