కేరళ : ఓ మహిళ బ్యాంకు నుంచి బయటికి వెళ్లే క్రమంలో బ్యాంకు ప్రవేశద్వారం వద్ద ఉన్న గ్లాస్ డోర్ కు వేగంగా తగలడం వలన ఆ గ్లాస్ పగిలి ఆమె పొత్తి కడుపులో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై ఆ మహిళ ప్రాణాలు విడిచిన ఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లాలో చోటుచేసుకుంది. బీనాపాల్ (40)అనే మహిళ సోమవారం ఎర్నాకులం జిల్లా పెరుంబవూర్ బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు బయట పార్కు చేసిన తన కారులో మర్చిపోయిన వస్తువు ఒకటి తీసుకరావడానికి బీనాపాల్ హడావుడిగా బయలుదేరింది.
బ్యాంకు ప్రవేశద్వారం వద్ద ఉన్న గ్లాస్ డోర్ తెరిచి ఉందనుకుని ముందుకు వెళ్లింది, అయితే డోర్ మూసిఉండటంతో వేగంగా వచ్చిన బీనాపాల్ తలకు గ్లాస్ డోర్ గట్టిగా తగిలింది. డోర్ పగిలి ముక్కలవడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. గ్లాస్ ముక్క ఒకటి బీనాపాల్ పొత్తికడుపులో గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడింది. రక్తస్రావంతో ఉన్న బీనాపాల్ను ఆస్పత్రికి తరలించారు. అయితే కడుపులోపల తీవ్రంగా రక్తస్రావం అవడంతో ఆ మహిళ ప్రాణాలు విడిచింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
https://youtu.be/DTfkhrYEuIk