ఇజ్రాయెల్ వైమానికి దాడులు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది అంటూ పోస్ట్ చేశాడు. అంతకుముందు, తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ఖమేనీ లొంగిపోవాలంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు తెలుసు అని.. కానీ, తాము చంపబోమని.. మర్యాదగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరిస్తూ.. జాతీయ భద్రతా బృందంతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కూడా మాట్లాడారని వైట్ హౌస్ తెలిపింది.
ఓ వైపు టెహ్రాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండగా.. ట్రంప్ కూడా టెల్ అవీవ్తో చేతులు కలిపేందుకు ఆలోచిస్తున్నట్లు అమెరికా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఇరాన్పై దాడులు తీవ్రం అయ్యే అవకాశం ఉండటంతో ఖమేనీ బుధవారం స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ గా స్పందిస్తూ ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామిక్ మతపరమైన వ్యక్తి హైదర్ను ప్రార్థిస్తూ.. “నమి” పేరుతో యుద్ధం ప్రారంభమైందని సోషల్ మీడియాలో ప్రకటించాడు.