Sunday, April 28, 2024

కిషన్ రెడ్డితో సఖ్యత ఉంది: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ప్రజలు బిజెపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ ప్రజల అంతరంగం తనకు తెలుసునన్నారు. ఎంపి బండి సంజయ్ కుమార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తనకు మంచి సఖ్యత ఉందన్నారు. బిజెపిలో అందరినీ కలుపుకుని వెళ్తామన్నారు. సిఎం కెసిఆర్ అహంకారాన్ని ఓడించాలంటే బిజెపికే సాధ్యమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Also Read: బండి సంజయ్ ఔట్.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News