Tuesday, May 7, 2024

ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసిన చిన్నశివునూర్ సర్పంచ్ అశోక్

- Advertisement -
- Advertisement -

చేగుంట: చేగుంట మండల చిన్నశివునూర్ సర్పంచ్ కొటారి అశోక్ మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. మంగళవారం ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి నివాసంలో చిన్నశివునూర్ సర్పంచ్ కొటారి అశోక్ తన పాలక వర్గ సభ్యులతో కలసి ఎంపిని కలసి గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరి చేయాలని కోరారు. స్పందించిన ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి చిన్నశివునూర్ గ్రామ అబివృద్ధి కోసం తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశివునూర్ సర్పంచ్ కోటారి అశోక్, ఉప సర్పంచ్ స్వామి, విద్యాకమిటీ చైర్మన్, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News