కోల్కతా: ఐపిఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్ పీక్స్లో ఉంటుంది. ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్లను మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. శనివారం ఆర్సిబి, సిఎస్కె మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఆర్సిబి 2 పరుగుల తేడాతో విజయం సాధించి.. అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా, ఆదివారం అంతకు మించిన మ్యాచ్కి ఈడెన్ గార్డెన్స్ వేదిక అయింది. కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నరాలు తెగిపోయేంత థ్రిల్లింగ్ మ్యాచ్లో కోల్కతా కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన రాయల్స్ ఆరంభంలోనే తడబడింది. 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న అతను మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో 95 పరుగులు చేశాడు. కానీ, హర్షిత్ రానా బౌలింగ్లో వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శుభం దూబే.. బౌండరీలు బాది జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. ఆఖరి బంతికి విజయానికి మూడు పరుగులు అవసరం ఆర్చర్ రనౌట్ కావడంతో కోల్కతా 1 పరుగు తేడాతో ఈ మ్యాచ్లో విజయం సాధించింది.