Thursday, May 2, 2024

షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెయినర్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారని అన్నారు. షర్మిల తెలంగాణకు వస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత పార్టీదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసిందని అన్నారు. షర్మిల వల్ల నాలుగు ఓట్లు వచ్చినా నాలుగు వందల ఓట్లు వచ్చినా పార్టీకి లాభమే నని అన్నారు. షర్మిలను పార్టీలో చేర్చుకోవాలన్నదే తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ హాయంలో పథకాలు అందిన పేదలంతా షర్మిల కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందని అంటున్నారని కోమటి రెడ్డి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News