Tuesday, April 30, 2024

రఘునందన్ రూ.100కోట్ల వ్యాఖ్యలపై..ఇడి జాడేది?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతల మధ్య అనైక్యత, ఇత్యాది అంశాలు రాజకీయ ప్ర త్యర్థులకు ఆయుధాలవుతున్నాయి. ఇటీవల జరిగిన మునుగో డు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు చే సిందని తెలంగాణ బిజెపి ఎంఎల్‌ఎ చేసిన వాదనను కేంద్ర ఏ జెన్సీలు ఎందుకు విచారించడం లేదని భారత రాష్ట్ర సమితి (బి ఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రశ్నిం చారు. “తెలంగాణ బిజెపి ఎంఎల్‌ఎ తమ పార్టీ మును గోడు ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని బహిరంగంగా చెబుతున్నప్పుడు
ఇసి, ఇడి, ఐటి ఎక్కడ ఉన్నా యి?

బిజెపికి ఏమైనా నోటీసులు జారీ చేస్తారా? లేదా విచారణ చేస్తారా?” అని కెటిఆర్ ఘాటుగా ప్రశ్నిం చారు. అవినీతి గురించి మోడీ మాట్లాడిన మాటలు విని 10లక్షల మంది చనిపోయారంటూ మంత్రి కెటిఆర్ వ్యంగ్యోక్తులు విసిరారు. తెలంగాణలో ఒక్క ఉపఎన్నిక కు బిజెపి రూ.100 కోట్లు ఖర్చు చేసిందని, ఆ పార్టీ ఎంఎల్‌ఎ షాకింగ్ ఆడియో లీక్ చేశారని, ఒక్క నియోజక వర్గానికి రూ.100 కోట్లు కేటా యిస్తే, బిజెపి ఏ స్థాయిలో అవి నీతి జరిగిందో ఊహించుకోవచ్చంటూ ఎంబిఎ గ్రాడ్యుయేట్ నాయిని అనురాగ్‌రెడ్డి ట్వీట్‌కు కెటిఆర్ ప్రతిస్పందించారు.
గత వారంలో..
గతేడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి రూ.100 కోట్లు ఖర్చు చేసిందని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు ఇటీవల ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో పేర్కొన్న సంగతి విదితమే. గత వారం అప్పటి రాష్ట్ర బిజెపిఅధ్యక్షుడు బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ఈ వాదన వినిపించారు. రఘునందన్‌రావు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కోరుతూ కరీంనగర్‌లో కొందరు స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News