Monday, May 6, 2024

రాష్ట్రానికి తైవాన్ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

KTR virtual meet with Taiwan Officials

తైవాన్‌తో స్టార్టప్ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న, దేశంలోని ఏకైక నగరం హైదరాబాద్
తెలంగాణతైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నెలకొంది
అక్కడి నుంచి పెట్టుబడులను రప్పించడానికి మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇస్తోంది
తైవాన్ నుంచి ప్రపంచం ఎంతో నేర్చుకోవాల్సి వుంది
ఆ దేశంతో వ్యాపార వాణిజ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికే ఈ సమావేశం ఇప్పటికే తైవాన్ కంప్యూటర్ అసోసియేషన్‌తో టెక్నాలజీ పార్టనర్‌షిప్ ఒప్పందం కుదిరింది
ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం నాడు జరిగిన తైవాన్ కనెక్ట్‌తెలంగాణ స్టేట్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: తైవాన్ పెట్టుబడులను ప్రొత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ- తైవాన్‌ల మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నెలకొందన్నారు. తైవాన్ నుంచి ప్రపంచం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. తైవాన్ పెట్టుబడుల కోసం ఆ దేశంలో పర్యటించిన ఈ విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం నాడిక్కడ వర్చువల్ ద్వారా నిర్వహించిన తైవాన్ -కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. తైవాన్, తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలు, కంపెనీలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తైవాన్ దేశానికి సంబంధించిన టిసిఎ (తైవాన్ కంప్యూటర్ అసోసియేషన్) తో టెక్నాలజీ పార్టర్నర్‌షిప్ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.భారతదేశంలో తైవాన్ స్టార్టప్ అలయన్స్ (భాగస్వామ్యం)ను ఏర్పాటు చేసుకున్న ఏకైక సిటీగా హైదరాబాద్‌కు ఖ్యాతి దక్కిందన్నారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందనారు. ఆ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. 2020వ సంవత్సరం నుంచి వ్యా పార, వాణిజ్య పరిస్థితులకు కరోన సంక్షోభం సవాళ్లను విసిరిందన్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందన్న విశ్వాసాన్నిమంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా కెటిఆర్ సంక్షిప్తంగా వివరించారు.

32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించాం

పెట్టుబడులను రాబట్టడంర తెలంగాణ రాష్ట్రం దూసకపోతున్నదని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రం సుమారు 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. దీని కారణంగానే రాష్ట్ర జిడిపి, తలసరి ఆదాయం ప్రతి సంవత్సం పెరుగుతూ వస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణ ఎప్పుడు అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఐటి, దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ వస్తుందన్నారు.
ఎలక్ట్రానిక్ దిగ్గజాలను

రాష్ట్రానికి ఆహ్వానిస్తాం

తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరిం గ్, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. ప్రస్తుతం తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సొ ల్యూషన్స్ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, దాని అనుబంధ రంగాల్లో తైవాన్‌తో బలమైన భాగస్వామ్యము కుదుర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు.

రాష్ట్ర పాలసీలు, పురోగతిపై ప్రసంశలు

ఇన్వెస్ట్ ఇండియా సిఇఒదీపక్ బగ్లా మాట్లాడు తూ, తెలంగాణ రాష్ట్ర పాలసీలు, రాష్ట్రం సాధిస్తు న్న పురోగతిపైన ప్రశంసలు కురిపించారు. ఇ న్వెస్ట్ ఇండియా తరఫున తెలంగాణతో కలిసి ప నిచేయడం ఎల్లప్పుడూ తమకు అత్యంత ప్రోత్సా హం ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన టైట్రా (తైవాన్ ఎక్సటర్నల్ ట్రేడ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ) చైర్మన్ జేమ్స్ ఎఫ్ హువంగ్, తె లంగాణ తైవాన్ దేశానికి సహజ భాగస్వామి తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తా ము అద్భుతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నామన్నారు. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో అనుబంధ రంగాల్లో ఈ భాగస్వామ్యాన్నిపెం చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ దిశగా ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటు చేసిన సమావేశం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ స మావేశంలో పరిశ్రమ ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపూరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News