Sunday, April 28, 2024

తిరుమలలో చిక్కిన మరో చిరుత..

- Advertisement -
- Advertisement -

తిరుమలలో బోనులో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసిన లక్ష్మీనరసింహ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ బోనులోకి వచ్చి చిరుత చిక్కుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఐదు చిరుతలను అటవి శాఖ అధికారులు బంధించారు. ఇది ఆరో చిరుత. బోనులో చిక్కిన చిరుతను అధికారులు జూ పార్కుకు తరలించనున్నారు. కాగా, అలిపిరి కాలినడక మార్గంలో చిరుతలు సంచరిస్తూ భక్తులపై దాడి చేస్తుండడంతో వాటిని బంధించేందుకు ట్రాప్ బోనులు ఏర్పాటు చేశారు. మరోవైపు, భక్తుల ఆత్మరక్షణ కోసం టిటిడి సిబ్బంది కర్రలను అందిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News