Sunday, April 28, 2024

కాంగ్రెస్ పార్టీకి మహేశ్వర్ రెడ్డి రాజీనామా.. ఆ పార్టీలోకి జంప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న అల్లెటి మహేశ్వర్‌రెడ్డి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేయడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు. రాష్ట్ర భాజపా చీఫ్‌ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి మహేశ్వర్‌రెడ్డి గురువారం న్యూఢిల్లీలోని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జి తరుణ్‌చుగ్‌ నివాసానికి వెళ్లారు.

Also Read: లలిత్ మోడీ క్షమాపణ చెప్పాలి: సుప్రీం ఆదేశం

అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటీ కానున్నారు. మహేశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధిష్టానానికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ధృవీకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడతానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News