Sunday, April 28, 2024

చెన్నై రాజ్‌భవన్ గేట్పై పెట్రోల్ బాంబులు విసిరిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అధికారిక నివాసం రాజ్‌భవన్ మెయిన్‌గేట్ ముందు పెట్రోల్ బాంబులు విసిరిన వ్యక్తిని బుధవారం పోలీస్‌లు అరెస్టు చేశారు. రాజ్‌భవన్ లోని మెయిన్‌గేట్ వైపు కరుక వినోద్ అనే వ్యక్తి మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో రెండు పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నై లోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులు విసిరినందుకు గతంలో అరెస్టయిన వినోద్ మూడు రోజుల కిందటే విడుదలయ్యాడు.

సైదాపేట్ కోర్టు ప్రాంగణంలో పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్‌ను చోరీ చేసిన వినోద్ నేరుగా రాజ్‌భవన్‌కు నడుచుకుంటూ వచ్చి రెండు బాటిల్స్‌లో పెట్రోల్ నింపి వాటికి నిప్పు పెట్టి రాజ్‌భవన్ ప్రధాన ద్వారం పైకి విసిరేశాడు. మెయిన్‌గేట్ వద్ద వినోద్‌ను పోలీస్‌లు అడ్డగించారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై స్పందించారు. ఈ సంఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News