Sunday, April 28, 2024

బాలికను రేప్ చేసిన వ్యక్తికి 60 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తికి నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నల్గొండ శివార్లలో ఉంటున్న బాలికకు నిజాముద్దీన్ అనే 36 ఏళ్ల వ్యక్తి మాయమాటలుచెప్పి, అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భవతి అయింది. బాధిత బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు సాగించారు.

నిందితుడు నిజాముద్దీన్ పై పోక్సోతోపాటు పలు కేసులు పెట్టారు. ఈ కేసులో శుక్రవారం న్యాయమూర్తి తీర్పు చెబుతూ పోక్సోతోపాటు మరో రెండు సెక్షన్ల కింద మూడు వేర్వేరు నేరాలకు సంబంధించి ఒక్కొక్క నేరానికి 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ఈ మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు. ఇదికాకుండా నేరస్థుడికి 60 వేల రూపాయల జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News