Friday, May 3, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ :జిల్లాలోని రామాయంపేట 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు  TS16FE8034 పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనా స్థానిక డబుల్ బెడ్ రూమ్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News