Saturday, April 20, 2024

కుటుంబంలో నలుగురిని చంపిన యువకుడు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలోని పాలం ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు, నాన్న, అమ్మమ్మ ఉన్నారు. మృతదేహాలన్నీ రక్తపు మడుగులో పడి ఉన్నాయి. అతను ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో తెలియాల్సిఉంది. మాదకద్రవ్యాలకు బానిసైన నిందితుడు తన సోదరీమణులు, తండ్రి, మనవరాలిని హత్య చేసి ఇప్పుడు అరెస్టు అయ్యాడు.

మహిళల్లో ఒకరు నేలపై పడుకోగా, ఇద్దరు సభ్యులు బాత్‌రూమ్‌లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. “పాలం ప్రాంతంలోని ఒక ఇంట్లో ఇద్దరు సోదరీమణులు, వారి తండ్రి, నానమ్మ సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను కత్తితో పొడిచి చంపారు. నిందితుడిని పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News