Sunday, April 28, 2024

భార్య గొడవ పడి వెళ్ళిపోయిందని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Man suicide attempt with Family quarrels

 

మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్ : భార్య గొడవ పడి తనను విడిచి వెళ్ళిపోయిందనే మనస్థాపంతో ఓ వ్యక్తి తనపై పెట్రోల్ పొసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చింతల్ సుదర్శన్‌రెడ్డినగర్‌లో భువన్ సూర్య (30) అతని భార్య, కూతురుతో ఓ భవనంలో అద్దెకు నివాసం ఉంటున్నాడు. భువన్ సూర్య నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో సెల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. భార్య వారు అద్దెకు ఉండే భవనంలో బ్యూటీ పార్లర్ షాపు నడిపిస్తుంది. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. గత 20 రోజుల క్రితం భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన అక్క ఇంటికి వెళ్ళిపొయింది. దీంతో కోపోద్రిక్తుడైన భవన సూర్య తాగిన మైకంలో ఓ మిత్రునితో కలిసి తన భార్య ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్ళి తీవ్రంగా కొట్టడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

అప్పటి నుంచి భార్య తన కూతురితో భువన సూర్య వద్దకు రాక తన బంధువుల ఇంటి వద్దనే ఉండిపోయింది. భువన సూర్య ఇంటికి రమ్మని ఎన్నో విధాలుగా ప్రయత్నించినా భార్య తన ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై డిప్రెషన్‌కు లోనైన భువన సూర్య శుక్రవారం మధ్యాహ్నం తాను నివాసం ఉంటున్న భవనం కిందకు వచ్చి రోడ్డుపై తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు భాధితుడు భువన సూర్యపై ఇతర బట్టలు కప్పి మంటలను ఆదుపులోకి తెచ్చారు. తన చావుకి ఎవరూ బాధ్యులు కారని, తన దహణసంస్కారాలకు డబ్బులు కూడా తన వద్ద లేవని సుసైడ్ నోట్‌లో భువన సూర్య రాశాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని భాధితుడిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్య భర్తల మధ్య గొడవే భువన సూర్య ఆత్మహత్యయత్నంకు కారణం అని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News