ముంబయి: పోలీస్ కానిస్టేబుల్పై ఓ వ్యక్తి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించబోయిన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వెలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలోలి గ్రామంలో నాయక్ జావేద్ జమాదార్ అనే కానిస్టేబుల్ లాక్డౌన్ నేపథ్యంలో పెట్రోలింగ్ చేస్తున్నాడు. అన్ని షాపులను మూసివేశారా? లేదా అనేది తనిఖీలు చేస్తున్నాడు. అరుణ్ సింగ్ జాధవ్ అనే వ్యక్తి తన బంధువుల బార్ షాపును మూసివేస్తున్నాడు. ఏ చేస్తున్నావని పోలీస్ ప్రశ్నించగానే అరుణ్ సింగ్ కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టాడు. అనంతరం తన దగ్గర ఉన్న బ్లేడ్తో కానిస్టేబుల్పై దాడి చేశాడు. కారులో నుంచి పెట్రోల్ తీసి కానిస్టేబుల్ పై చల్లాడు. అగ్గిపుల్ల గీసి మంటలు అంటిస్తుండగా స్థానికులు అరుణ్ సింగ్ను పట్టుకున్నారు. స్థానికులు సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని గాయపడిన కానిస్టేబుల్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ఐపిసి 301, 506, 332, 353 కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని డిఎస్పి పి రాజ్గురు తెలిపాడు.