Sunday, April 28, 2024

బిజెపి దుర్మార్గాలకు మణిపూర్ పరాకాష్ఠ

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:బిజెపి దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్ఠగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్ధి పొందాలన్నది బిజెపి వ్యూహంలో భాగంగా కనిపిస్తుందన్నారు. గడిచిన లోక్ సభ ఎన్నికల్లో పుల్వామా ఉదంతమే ఇ ందుకు నిదర్శనమన్నారు.నిజానికి పుల్వామా ఉదంతం బిజెపి సృష్టిగా ఆయన చెప్పారు.

ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బిఆర్‌ఎస్ శ్రేణుల ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘ్ పరివార్ క్రియేటివిటీలో భాగమే పుల్వామా దాడులుగా ఆయన అభివర్ణించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నా టికి కాశ్మీర్‌లో మరో రచ్చ సృష్టించేందుకు బిజేపి కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు. బిజెపి పై దేశ ప్రజల్లో భ్రమలు తొలగడంతో అడ్డదారుల్లో మెజార్టీ ప్రజల్లో పొలరైజేషన్ సృష్టించి అధికారంలోకి రావాలన్నది సంఘ్ పరివార్ ఆలోచన అని ఆయన విమర్శించారు. అయితే దేశ వ్యాప్తంగా మోడీ పై ప్రజల్లో ఆధర ణ తగ్గిందని, కర్ణాటక ఫలితమే అందుకు నిదర్శమన్నారు.

ప్రధాని హోదాలో మోడీ చేసిన రోడ్ షోలకు జనామోధం లభించలేదన్నారు. ప్రధాని కాక ముందు మోడీ ఎక్కడా రోడ్ షోలు చేసిన దాఖలాలు లేవన్నా. బిజెపి విధానాలు సామాన్యులకే కాకుండా విద్యావంతులకు నచ్చడం లేదన్నారు. దేశ రాజకీయాల్లో కా ంగ్రెస్ బలహీన పడిందన్నారు. చెడగొట్టే వానికంటే ఏమి చేయలేని వాడే బెటర్ అనుకుని అక్కడ కాంగ్రెస్‌ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఎన్నికల హామీలు అమలు పర్చడంలో అధికార పార్టీ అప్పుడే విఫలమైందన్న ఆరోపణలు రావడం గర్హనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News